పోస్టాఫీస్​ తెరవరు.. కార్డులు పంచరు

పోస్టాఫీస్​ తెరవరు.. కార్డులు పంచరు

సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని పోస్టాఫీస్​ ప్రతిరోజు మూసే ఉంటుంది. వచ్చిన లెటర్లు, పార్సల్స్​ను ఎవరూ పంపిణీ చేయకపోవడంతో నెలల తరబడి పెండింగ్​లో నే ఉంటున్నాయి. మర్కుక్​మండలంలోని చేబర్తి  బ్రాంచ్​పోస్ట్​మాస్టర్​కేతవత్​ సంతోష్​కు ఈ బ్రాంచ్​ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. అతడు వారంలో ఒకటి రెండు సార్లు సాయంత్రం తర్వాత పోస్టాఫీస్​ తెరిచి కొద్దిసేపు వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి వెళ్లిపోతున్నాడు. 

దీంతో అతడి రాకకోసం పెన్షన్​దారులు రోజుల తరబడి ఎదురుచూడక తప్పడంలేదు. ఇప్పటికైనా ఈ బ్రాంచ్​లో పర్మినెంట్ సిబ్బందిని నియమించి సేవలు పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్​చేస్తున్నారు. - ములుగు, వెలుగు