నీళ్లలో కొండచిలువ ఇరుక్కుంది.. కాపాడిన జలాశయ సిబ్బంది

నీళ్లలో కొండచిలువ ఇరుక్కుంది.. కాపాడిన జలాశయ సిబ్బంది

మనం పాములు, కొండచిలువల పేర్లు వినగానే వణికిపోతాం. అందునా భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాల్లో కొండ చిలువలు హల్ చల్ చేస్తున్నాయి.హిమాయత్​ సాగర్​ జలాశయంలో కొండచిలువ కలకలం రేపింది. హిమాయత్​ సాగర్​ జలాశయం క్రస్ట్​ గేట్లు వద్ద కొండ చిలువ ఇరుక్కుంది.  తీవ్ర ఇబ్బందులు పడుతున కొండ చిలువను గుర్తించిన జలమండలి సిబ్బంది  స్నేక్​ క్యాచర్​ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Also Read :- సాగర్​ ప్రాజెక్ట్​ 20 క్రస్ట్‌‌‌‌ గేట్లు ఓపెన్‌‌‌‌

హిమాయత్​ సాగర్​ జలాశయం వద్దకు వచ్చిన స్నేక్​ క్యాచర్స్​ కొండ చిలువను రక్షించారు.  క్రస్ట్​ గేట్​ వద్దకు వెళ్లి.. కొండచిలువ నోటిని పట్టుకుని తాడు సాయంతో కొండచిలువను తీసుకొని పైకి వచ్చారు.  తరువాత జలమండలి అధికారులు, స్నేక్​ క్యాచర్లు  కొండ చిలువను జూ అధికారులకు అప్పగించారు.