జైపూర్: కర్వాచౌత్ రోజున భర్త ఆలస్యంగా ఇంటికిరావడంతో మొదలైన గొడవ.. ప్రాణాలు తీసుకునేదాకా వెళ్లింది. కోపంలో పరిగెత్తుకుంటూ వెళ్లి వేగంగా వస్తున్న రైలు కింద పడి భార్య ఆత్మహత్య చేసుకోగా, ఇది చూసి మనోవేదనకు గురైన భర్త ఇంటికి వెళ్లి భార్య చీరతో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. రాజస్థాన్లోని జైపూర్లో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. జైపూర్లోని హర్మదా ప్రాంతానికి చెందిన ఘనశ్యామ్ బంకర్(38) నెట్వర్కింగ్ మార్కెటింగ్లో పనిచేస్తున్నారు. కర్వాచౌత్ రోజున డ్యూటీ ముగించుకుని ఆయన ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు.
అప్పటికే పూజలు చేసి ఎదురుచూస్తున్న ఆయన భార్య మోనిక.. లేటుగా రావడంపై భర్తను నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. అదే కోపంలో మోనిక ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వెళ్లి వేగంగా వస్తున్న రైలు కింద పడ్డది. దీంతో అక్కడికక్కడే చనిపోయింది. వెనకాలే వెళ్లిన భర్త ఇదంతా చూసి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చి మోనిక చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఘనశ్యామ్కూడా ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే జరిగిన విషయాన్నంతా తమ్ముడికి వాట్సాప్లో వాయిస్ మెస్సేజ్ పంపాడు. ఇద్దరి డెడ్బాడీలను పోలీసులు పోస్ట్మార్టానికి తరలించారు.