అబ్దుల్లాపూర్‎మెట్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వీరంగం

అబ్దుల్లాపూర్‎మెట్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వీరంగం

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‎మెట్‎లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీరంగం సృష్టించారు. భూ వివాదానికి సంబంధించి గ్రామస్థులపై దాడులకు దిగారు. వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్ మెట్ పిగ్లిపూర్‎ గ్రామంలోని సర్వే నంబర్ 17పై నెలకొన్న వివాదంపై మాట్లాడుదామని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామస్థులను చర్చలకు పిలిచారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. 

ALSO READ | ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలతో తమను కొట్టించారని గ్రామస్థులు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‎లో  రికార్డులు తారుమారు చేసి వందల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసిన రియల్ వ్యాపారులు..  ఇప్పుడు మాట్లాడుకుందామని పిలిచి తమపై దాడులకు దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. 

సీలింగ్ ల్యాండ్‎ను పట్టాగా రికార్డ్‎లలో చూపించి మా భూములు గుంజుకున్నారని వాపోయిన గ్రామస్థులు..  మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడుకుందామని పిలిచి మాపై కర్రలు, రాడ్లతో దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.