
‘ఇండియా ఇండిపెండెన్స్ డే’ని చిట్టచివరి బ్రిటిష్ వైశ్రాయ్, మొట్టమొదటి ‘గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా’ లూయిస్ మౌంట్ బాటెన్ నిర్ణయించారు. దీనికి ఆయన 1947లో ఆగస్టు 15ని ఎంపిక చేసుకున్నారు. అయితే మౌంట్ బాటెన్ ఈ తేదీనే ఎందుకు ఎంచుకున్నారనే దానికి వెనక ఆసక్తికర అంశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసింది. ఆ ఏడాది మొదటి మూడు నాలుగు నెలల్లో యూరప్లోని పశ్చిమ భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్ర రాజ్యాల సేనలపై చేసిన పలు ఎటాక్లు ఫెయిలయ్యాయి. మే నెలలో సోవియెట్ సేనలు జర్మనీ క్యాపిటల్ బెర్లిన్ను ఆక్రమించాయి. ఇది తెలిసి హిట్లర్ సుసైడ్ చేసుకున్నాడు. ఆగ్నేయాసియా ప్రాంతంలో బ్రిటిష్ దళాలు జపాన్ సైన్యాన్ని ఓడించి తరిమేశాయి. అప్పుడు మౌంట్ బాటెన్.. సౌత్ ఈస్ట్ ఏసియా అలైడ్ ఫోర్సెస్కి సుప్రీం కమాండర్. ఆగస్టులో మిత్రరాజ్యాల రిక్వెస్ట్తో సోవియెట్ యూనియన్ జపాన్ అధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియాలపై దాడి చేసి విజయం సాధించింది. జపాన్ ఆగస్టు 15న లొంగిపోయింది. దీంతో మౌంట్ బాటెన్ ఇండియా ఇండిపెండెన్స్ డేని ఆగస్టు 15గా నిర్ణయించారు.