
హైదరాబాద్: తాము అధికారంలో ఉన్నప్పుడు పడ్డ శ్రమ రాష్ట్రానికి ఇప్పుడు ఫలితాల్ని ఇస్తోందని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్అన్నారు. 'రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు 2022–-23లోనే బీవైడీ, ఒలెక్ట్రా అంగీకారం తెలిపింది.
కేంద్రం కారణంగా అప్పట్లో అది ఆగింది. ఆ పెట్టుబడులు ఎట్టకేలకు రాష్ట్రానికి వస్తుండటం సంతోషం. కేవలం మా ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైంది. ఏండ్ల తరబడి కష్టపడిన అందరికీ అభినందనలు’ అని ట్వీట్చేశారు.