
నిజామాబాద్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన కీలక పాత్రను పాలకులు గుర్తించాలని టీయూడబ్ల్యుజే యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ఎడ్ల సంజీవ్ కోరారు. ఆదివారం వినాయక్నగర్లోని అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాజమాన్యాలు ఉద్యోగాలు తొలగిస్తాయని తెలిసి కూడా జర్నలిస్ట్లు మలిదశ ఉద్యమంలో గొప్ప రోల్ పోషించారన్నారు.
పాలక నేతలు తమను గుర్తించడం లేదని వాపోయారు. గతంలో జరిగిన లోపాలను కాంగ్రెస్ గవర్నమెంట్సరి చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. స్టేట్ కౌన్సిల్ మెంబర్ బొబ్బిలి నర్సయ్య, జిల్లా జనరల్ సెక్రెటరీ అరవింద్ బాలాజీ, ట్రెజరర్ సిరిగాధ ప్రసాద్, సంజీవ్రెడ్డి అక్రిడేషన్ కమిటీ సభ్యుడు పాకాల నర్సింలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాజేశ్, ధనుంజయ్, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, భైరా శేఖర్, గోవిందరాజు తదితరులు ఉన్నారు