జీతం డబ్బులు ఇవ్వట్లేదని.. కాంట్రాక్టర్ మర్డర్

జీతం డబ్బులు ఇవ్వట్లేదని.. కాంట్రాక్టర్ మర్డర్

గచ్చిబౌలి, వెలుగు: జీతం డబ్బులు ఇవ్వట్లేదని పెయింటింగ్ కాంట్రాక్టర్​ను మర్డర్ చేశారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన ప్రకారం.. యూపీకి చెందిన రాజ్​కుమార్​(44), తనతో పాటు ఆరుగురిని తీసుకుని సిటీకి వచ్చి వట్టినాగులపల్లిలో ఉంటున్నాడు. బిల్డింగ్ పెయింటింగ్​ పనులు కాంట్రాక్టు తీసుకొని చేయిస్తున్నాడు. ఓనర్ల వద్ద డబ్బులు తీసుకొని కూలీలకు ఇవ్వకుండా వేధిస్తుండగా.. కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. 

మంగళవారం రాత్రి అందరూ కలిసి మద్యం తాగారు. మరోసారి కూలీ డబ్బుల విషయమై గొడవ జరిగింది. రాత్రి 11 గంటలప్పుడు ఇంట్లో నిద్రపోయారు. అర్ధరాత్రి దాటాక కూలీల్లో ఒకరు రాజ్​కుమార్​ తలపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. బుధవారం  ఇంటి వెనకాల  ఉండే రాజస్థాన్​కు చెందిన కూలీలు రాజ్​కుమార్ ​డెడ్ బాడీని చూసి ఓనర్​గబ్బర్​సింగ్​కు చెప్పారు. అతను  కంప్లయింట్ చేయగా.. పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేశారు. ఆరుగురు కూలీలను అదుపులోకి తీసుకుని.. రాంసింగ్​అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించారు. మిగిలిన కూలీలను విచారిస్తున్నారు.