స్కూల్‪లో అసాంఘిక కార్యకలాపాలు, ర్యాగింగ్‌పై నిర్లక్ష్యం.. ABVP విద్యార్థి సంఘాల ధర్నా

స్కూల్‪లో అసాంఘిక కార్యకలాపాలు, ర్యాగింగ్‌పై నిర్లక్ష్యం.. ABVP విద్యార్థి సంఘాల ధర్నా

కుత్బుల్లాపూర్: హైదరాబాద్ లోని ఓ స్కూల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నా.. ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను వేధిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ABVP విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. కుత్బుల్లాపూర్ పరిది మైసమ్మగూడలోని DRS ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, అలాగే పాఠశాలలో జరుగుతున్న ర్యాగింగ్ విషయాల్ని దాచి పెడుతున్న స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లి తండ్రులతో కలిసి ABVP విద్యార్థి సంఘాల ధర్నా చేశారు. విద్యార్థి సంఘం నాయకులు స్కూల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.