శ్రీ రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం

శ్రీ రామనవమి ‘అల్లర్ల’ పిటిషన్ పై సుప్రీంకోర్టు అసహనం

శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీతో సహా పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. మాజీ సీజేఐలు ఎవరూ ఖాళీగా లేరంటూ పిటిషనర్ పై అసహనం వ్యక్తం చేసింది. 

ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్ పురిలో చేపట్టిన శోభాయాత్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులకు పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘర్షణల్లో పోలీసులు సహా పలువురు పౌరులు గాయపడ్డారు. ఈ ఘటన కంటే కొద్ది రోజుల ముందు శ్రీరామ నవమి సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. 

ఈ ఘటనలపై న్యాయపరమైన దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. విశాల్ తివారీ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ గొడవలపై దర్యాప్తునకు మాజీ సీజేఐ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం.. పిటిషన్దారుపై అసహనం వ్యక్తం చేసింది. ‘మాజీ సీజేఐ నేతృత్వంలో దర్యాప్తు జరిపించాలని మీరు కోరుతున్నారా..? ఇక్కడ ఎవరైనా ఖాళీగా ఉన్నారా..? ఇలాంటివి అభ్యర్థించకండి. ఈ పిటిషన్ ను కొట్టివేస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తల కోసం..

సిటీలో మూడు టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంఖుస్థాపన

ఖైరతాబాద్ వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద బీజేపీ ఆందోళన