గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ

గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది.  కురవి మండలంలోని తట్టుపల్లి  గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.  గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది . గ్రామపంచాయతీ సిబ్బంది  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

 కురవి మండలంలోని తట్టుపల్లి  గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తోంది నాగలక్ష్మి.  అయితే గత ఏడాది నుంచి గ్రామానికి చెందిన దొంతు యాదగిరి అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని..  పై అధికారులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించింది.  తన చావుతోనైనా తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ కు రాసిన సూసైడ్  నోట్ లో పేర్కొంది కార్యదర్శి నాగలక్ష్మి. 

ALSO READ | అత్తింటి వేధింపులకు వివాహిత ఆత్మహత్య