
కారేపల్లి, వెలుగు : కారేపల్లి మండలం చర్లపల్లిలో రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త రైల్వే స్టేషన్ పనులు ఏడాదిగా కొనసాగుతున్నాయి. రైల్వే ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో క్వాలిటీ లోపిస్తోంది. ఫ్లాట్ఫాంను ఆనుకొని ఇటీవల నిర్మించిన ప్రహరీగోడ శుక్రవారం కురిసిన చిన్నవానకే కూలిపోయింది. రైల్వేస్టేషన్ బిల్డింగ్గోడలు పూర్తి కాకుండానే బీటలు వారుతున్నాయి.