హైడ్రా దగ్గరున్న ఆయుధాలివే.. జపాన్ నుంచి ఈ బాహుబలి మెషన్స్

హైడ్రా దగ్గరున్న ఆయుధాలివే..  జపాన్ నుంచి ఈ బాహుబలి మెషన్స్

పెద్దపెద్ద బిల్డింగులు నేలమట్టం చేయాలంటే హైడ్రాకు భారీ మెషన్లు కావాస్సిందే.. భారీ బిల్డింగులను కూల్చేయాడానికి మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించింది హైడ్రా. అత్యాధునిక టెక్నాలజీతో స్పీడ్​గా భవనాలను కూలుస్తుందనే పేరున్న మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి.. ఆ బిల్డింగును కూడా కూల్చేసింది ఈ కంపెనీనే. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలకు కూడా అదే కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంది. 

మరో 1500 అక్రమ కట్టడాల లిస్ట్ హైడ్రా రెడీ చేసి పెట్టింది. నెక్ట్స్ యాక్షన్ ఫోర్స్ దింపడానికి హైడ్రా అధికారులు ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు హైడ్రా కూల్చివేతల్లో కూడా ఈ సంస్థ మూడు హైరిచ్ కాంబి కటింగ్​మెషీన్​(జాక్ కటర్,  షేర్ కటర్, రాక్ బ్రేకర్ )న్లతో పాటు 22 రాక్ బ్రేకర్స్ యంత్రాలను వాడుతోంది. వీటితో 15 నుంచి 20 ఫ్లోర్ల (40 మీటర్ల ఎత్తు) బిల్డింగ్స్ పక్కన ఉన్న ఎటువంటి డ్యామెజ్ జరగకుండా నేలమట్టం చేయవచ్చు. అంతకు మించి భవనాలుంటే కంట్రోల్ బ్లాస్టింగ్ ద్వారా కూల్చివేస్తారు.  

మరో 25 తెచ్చేందుకు రెడీ  

మాలిక్ ట్రేడింగ్ అండ్ డిమాలేషన్ కంపెనీ జపాన్, కొరియా, ఇటలీ దేశాల్లో తయారు చేసే రూ.3 కోట్ల విలువైన హైరిచ్ కాంబి కటింగ్​మెషీన్​వాడారు. ఈ యంత్రాలు కావాలంటే 4 నెలలు ముందే బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైడ్రా 25 మెషీన్లను ఉపయోగిస్తోంది. ప్రస్తుతమున్న 25కి అవసరమైతే మరో 25 కూడా తెచ్చేందుకు కాంట్రాక్ట్​ సంస్థ రెడీ అయినట్టు తెలిసింది. వీటితో 20 నుంచి 30 వరకు బిల్డింగులను ఈజీగా కూల్చేయవచ్చు. అయితే, కూల్చివేతలు ఫాస్ట్ గా కొనసాగుతున్నప్పటికీ ఈ యంత్రాలను ఒకచోట నుంచి మరోచోటకు తరలించేందుకు గంటల సమయం పడుతోంది. డిమాలిష్​చేయడానికి ముందే ఎలా కూల్చాలో ఇంజినీర్లు డిజైన్ చేస్తారు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలు వారంలో రెండు రోజులు మాత్రమే సాగాయి. హైడ్రా దగ్గర పెద్ద లిస్టే ఉన్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో కూల్చివేతల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీంతో మరిన్ని మెషీన్లు తెచ్చుకోవాలని సదరు సంస్థకు హైడ్రా సూచించినట్టు సమాచారం. 

రెండు నెలల్లో 166 నిర్మాణాలు నేలమట్టం

హైడ్రా ఏర్పడి రెండు నెలలైంది. ఈ రెండు నెలల్లో 18 ప్రాంతాల్లో 166 ఆక్రమణలను నేలమట్టం చేసింది. ఈ ఆక్రమణల వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలలతో పాటు  ప్రధాన  పార్టీలకు చెందిన నేతలు కూడా ఉన్నారు. కొందరు బడాబాబులకు చెందిన ఆక్రమణలు కూడా కూల్చడంతో జనాలకు నమ్మకం పెరిగి ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే తరహాలో విచారణ జరిపి యాక్షన్ తీసుకునేందుకు హైడ్రా బాస్​ప్లాన్ చేస్తున్నారు. 

ALSO READ : ఒవైసీ అక్రమ నిర్మాణాలు కూల్చండి

హైడ్రాకి సిబ్బంది తక్కువగా ఉండడంతో కావాల్సిన వారిని త్వరలో ప్రభుత్వం నియమించబోతున్నట్టు తెలిసింది. అలాగే ప్రత్యేకంగా ఓ పోలీస్​స్టేషన్ కూడా ఏర్పాటు చేయనుంది. ఆక్రమణల కూల్చివేతే లక్ష్యమని, ఎవ్వరినీ పట్టించుకోవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో హైడ్రా ఎక్కడా చర్యలకు వెనుకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.