సర్జరీ జరిగాక యువకుడు మృతి

సర్జరీ జరిగాక యువకుడు మృతి
  • డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని బంధువుల ఆందోళన

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్​పరిధిలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్న యువకుడు చనిపోగా, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మరణించాడని బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ కి చెందిన పంజాల అజయ్ (32) పీర్జాదిగూడ ముత్యవల్లిగూడలోని చెల్లెలి ఇంటికి వచ్చాడు.

ఈ నెల15న బాత్​రూంలో పడిపోవడంతో పీర్జాదిగూడలో జేపీ హాస్పిటల్ లో చేర్చారు. న్యూరో సమస్య ఉందని, ఆపరేషన్ చేసిన డాక్టర్లు ట్రీట్​మెంట్​చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అజయ్ చనిపోయాడని చెప్పారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యవ వల్లే చనిపోయాడని హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే రూ.3 లక్షలు కట్టామని, వేరే హాస్పిటల్ కు తీసుకువెళ్తామని చెప్పినా పంపించలేదని ఆరోపించారు. డీఎంహెచ్​వోకు ఫోన్​చేస్తే స్పందించడం లేదన్నారు.