
- భైరాన్పల్లి చరిత్రను ఇమేజ్పెంచుకోవడానికి వాడుకుంటున్నారని ఆరోపణ
చేర్యాల, వెలుగు : సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని వీరభైరాన్పల్లి గ్రామంలో 75 ఏండ్ల కింద రజాకర్ల దాడులకు బలైన118 మంది అమరవీరులను గుర్తించి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ ఆదివారం నిర్వహించిన సామూహిక పిండప్రదానం, సామూహిక పితృయజ్ఞాన్ని గ్రామ యువకులు అడ్డుకున్నారు. అమరుల కుటుంబాలను పిలువకుండా సామూహిక పిండప్రదానంతో పాటుగా పితృ యజ్ఞాన్ని ఎలా చేస్తారని, ఆనాటి నుంచి నేటి వరకు అమరుల కుటుంబాలకు ఏలాంటి సౌకర్యాలుగాని, పెన్షన్గాని ఇవ్వకుండా ఇలాంటి కార్యక్రమాలను ఎలా నిర్వహిస్తారని ఆరోపిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో చేర్యాల సీఐ పి.సత్యనారాయణరెడ్డితో యువకులు వాగ్వాదానికి దిగారు. ప్రతీ సంవత్సరం భైరాన్పల్లి చరిత్రను రాజకీయ నాయకులు వాడుకుని వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, ఆనంద భాస్కర్ పిండప్రదానం, యజ్ఞం కార్యక్రమాలను నిర్వహించి వెళ్లిపోయారు.