
అయిజ, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. మల్దకల్ మండలం అమరవాయి సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, అయిజలోని హెచ్ పీ పెట్రోల్ బంకుల్లో చోరీ చేశారు. శుక్రవారం తెలవారుజామున అమరవాయి బంక్లో మేనేజర్ రూమ్ అద్దాలు పగులగొట్టి సిబ్బందిని బెదిరించి రూ.1.20 లక్ష ల నగదు ఎత్తుకెళ్లారు.
అయిజ బంక్లో స్టాఫ్ రూమ్ పై రాళ్లతో దాడి చేసి, సిబ్బందిని కత్తులతో బెదిరించి కౌంటర్ లో ఉన్న రూ. లక్ష నగదు, సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. తేరుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటన జరిగిన తీరును అడిగి తెలసుకున్నారు. ఈ రెండు ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.