
• రూ. 2.20 లక్షల విలువైన డైమండ్ రింగ్స్ ఎత్తుకెళ్లిండ్రు
• పీఎస్లో ఫిర్యాదు చేసిన హీరో తండ్రి
సినీ హీరో విశ్వక్సేన్ సోదరి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్రోడ్డు నంబర్ -8లోని బిల్డింగ్ థర్డ్తోప్లోర్లోని ఆమె రూమ్ లోవస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి ఆందోళన చెందింది. పరిశీలించగా రెండు గోల్డ్ డైమండ్ రింగ్స్ పాటు ఒక హెడ్ఫోన్ కనిపించలేదు.
దీంతో విషయాన్నితన తండ్రి రాజుకు చెప్పగా.. ఆయన పీఎస్లో ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి తెల్లవారుజామున ఇంటి ముందు బైక్ పార్కు చేసినట్లుగా గుర్తించారు.
Also Read:- వామ్మో.. హీరోయిన్ ప్రణీత ని ఇలా ఎప్పుడూ చూసుండరు..
సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంత స్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్లి అల్మరాలో నుంచి నగలు దొంగలిం చిన్నట్లుగా గుర్తించారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.2.20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.