కాకతీయ ఎక్స్​ప్రెస్​లో చోరీ.. రైలులో నిద్రపోతున్న మహిళ బ్యాగ్​తో దొంగ జంప్​

కాకతీయ  ఎక్స్​ప్రెస్​లో చోరీ.. రైలులో నిద్రపోతున్న మహిళ  బ్యాగ్​తో దొంగ జంప్​

 భద్రాద్రికొత్తగూడెం,వెలుగు: హైదరాబాద్​ నుంచి కొత్తగూడెం వస్తున్న కాకతీయ ఎక్స్​ప్రెస్​లో చోరీ జరిగింది. కొత్తగూడెం వచ్చేందుకు శనివారం వరంగల్​లో కొంతమంది ట్రైన్​ఎక్కారు. ఓ మహిళ నిద్రమత్తులో ఉండడాన్ని గమనించిన దొంగ కొత్తగూడెం రైల్వే స్టేషన్​కు అరగంటలో ట్రైన్​ చేరుకుంటుందనగా ఆమె బ్యాగ్ దొంగిలించాడు. వెంటనే మహిళ అరవగా గాంధీపురం నుంచి కారేపల్లి మధ్య ప్రాంతంలో కదులుతున్న రైల్లోంచి దూకి పారిపోయాడు. కొత్తగూడెంలో రైల్వే పోలీసులకు కంప్లయింట్​ఇచ్చారు. బ్యాగులో రూ.10వేలు నగదుతో పాటు క్రెడిట్, ఏటీఎం కార్డులున్నాయని తెలిపారు.