
రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటవుతున్న మహాత్మాజ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల్లో తొలి ఏడాది గెస్ట్ టీచర్లతోనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది .2019–20 విద్యా సంవత్సరా నికి గాను ప్రభుత్వంకొత్తగా 119 బీసీ రెసిడెన్ షియల్ స్కూళ్ల ఏర్పాటు-కు ఇటీవల అనుమతి ఇచ్చిం ది. దీంతో ఐదు,ఆరు, ఏడు తరగతుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వచ్చిం ది. జూన్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఈ గురుకులాల్లో రెగ్యులర్ టీచర్ల భర్తీకి కేబినెట్ అనుమతి ఇచ్చినా ఆర్థిక శాఖ నుంచి తుది ఉత్తర్వులు జారీకాలేదు.ఫలితంగా తొలి ఏడాది బోధనకు గెస్ట్ టీచర్లను నియమించు కునేందుకు గురుకుల అధికారులు సిద్ధమవుతున్నా రు.
ఇవీ సమస్యలు
2019–-20 విద్యాసంవత్సరానికి గాను బీసీ గురుకులాల్లో 1,904 రెగ్యు లర్ టీచింగ్ , నాన్ టీచింగ్స్టాఫ్ , సొసైటీ సెక్రటరీ కార్యాలయంలో 28 రెగ్యులర్ పోస్టుల భర్తీకి గురుకుల విద్యాలయ సంస్థరిక్రూట్మెంట్ బోర్డ్ వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చిభర్తీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. మంజూరు చేసిన పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ తుది ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో బీసీ గురుకుల సొసైటీ ఈ పోస్టులను నోటిఫై చేయలేదు. ఎన్నికల కోడ్ కారణంగా మే నెలాఖరు నాటికి ఈ పోస్టులకు తుది అనుమతి,నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఇక, కొత్తప్రెసి డెన్ షియల్ ఆర్డర్కు అనుగుణంగా ఉద్యోగాల కేడర్ ఫిక్సేషన్ అంశం సైతం పెండింగ్ లోఉంది. గురుకులాల్లో భర్తీ చేసే ప్రిన్సిపాల్ , పీజీటీ,టీజీటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, లైబ్రేరియన్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఇన్స్ ట్రక్టర్ , స్టాఫ్ నర్స్,సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్టైపిస్ట్ పోస్టులు ఏ కేడర్లోకి వస్తాయో సొసైటీలే నిర్ణయించాల్సి ఉంది. కేడర్పై క్లారిటీ కోసం సొసైటీలు ఇదివరకే సంబంధిత శాఖలకు లేఖలు రాసినా ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో రెగ్యు లర్ పోస్టులకు ఇప్పట్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.