మంచిర్యాల కాంగ్రెస్ టికెట్​ కోసం .. భార్యాభర్తల నడుమ ​ఫైట్​

మంచిర్యాల కాంగ్రెస్  టికెట్​ కోసం .. భార్యాభర్తల నడుమ ​ఫైట్​
  • భార్యాభర్తల నడుమ టికెట్​ ఫైట్​ 
  • మంచిర్యాల కాంగ్రెస్  టికెట్​ కోసం ప్రేమ్​సాగర్​ రావు ప్రయత్నం
  • ఆయన భార్య, డీసీసీ చైర్​ పర్సన్ సురేఖ ​వైపు హైకమాండ్​ మొగ్గు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల కాంగ్రెస్​ టికెట్ భార్యాభర్తల్లో ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ మెంబర్  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (పీఎస్సార్) ముందునుంచీ టికెట్​తనకే వస్తుందని ధీమాగా ఉన్నారు. గత ఎన్నికలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన ఆయన ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే పార్టీ మాత్రం పీఎస్సార్​ భార్య, డీసీసీ చైర్ పర్సన్  కొక్కిరాల సురేఖ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ సర్వేలో ప్రేమ్ సాగర్ రావు కంటే సురేఖకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు తేలిందని సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ సూచనప్రాయంగా చెప్పిందని, దానిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 

ఉమ్మడి రాష్ట్రంలో లోకల్​ బాడీస్​ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆదిలాబాద్​ జిల్లాలో పీఎస్సార్​ హవా నడిచింది. అప్పటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగాన్నీ కంట్రోల్ చేశారు. చాలా దూకు డుగా వ్యవహరించారు.  హైదరాబాద్​లో కొన్ని దందాలు నడిపారనే ఆరోపణలూ ఉన్నాయి. తన తండ్రి కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో కొన్నేండ్లుగా  సేవా కార్యక్రమాలు చేస్తున్నా  ఆశించిన మైలేజీ రాలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు  పీఎస్సార్​సతీమణి సురేఖ రెండోసారి డీసీసీ చైర్​పర్సన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఇంటింటికీ కాం గ్రెస్​ పేరుతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్య టిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటు న్నారు. ఈ నేపథ్యంలోనే  సురేఖను బరిలోకి దించితే ఫలితం ఉంటుందని పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. అయితే మంచిర్యాల నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రేమ్​సాగర్​రావు పేర్కొంటున్నారు. 

పీసీసీ చీఫ్​తో పడట్లేదా?

ప్రేమ్​సాగర్​రావుకు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డితో విభే దాలున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్​కు పీసీసీ చీఫ్​ బాధ్యతలు అప్పగించడంపై అప్పట్లో బహి రంగం గానే  ప్రేమ్​సాగర్​రావు నిరసన తెలిపారు. భట్టి విక్రమార్క వర్గీయుడనే ముద్ర ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఆయనకు టికెట్​ ఇచ్చే విషయంలో మైనస్​గా మారుతున్నాయని అంటు న్నారు.