గణేశ్​ఊరేగింపులో కత్తిపోట్ల కలకలం

గణేశ్​ఊరేగింపులో కత్తిపోట్ల కలకలం

గణేశ్​ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటన మేడ్చల్​పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఘట్​కేసర్​ఈడబ్ల్యూ ఎస్ కాలనీలో గణేశ్​ఊరేగింపులో ఘర్షణ జరిగింది.  డీజే ఆపరేటర్​సాయి(24) పై మహేశ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి, అక్కడినుంచి పారిపోయాడు.  సాయికి తీవ్ర గాయాలయ్యాయి.  కీసరలోకి ఆసుపత్రికి తరలించారు.  ప్రస్తుతం సాయి కండీషన్​సీరియస్‎గా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నిందితుడు మహేశ్‎ను అదుపులోకి తీసుకున్నారు.  

కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. పాత కక్షతో  హత్యాయత్నం జరిగి ఉంటుందని  తెలుస్తోంది. డీజే ఆపరేటర్​ప్రేమ వివాహమే కత్తిపొట్లకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఏడాది క్రితం దాడి చేసిన మహేశ్​సోదరిని సాయి లవ్​మ్యారేజ్​ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడిపై దాడి చేసిన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు.