గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యేలు

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిశీలన కోసం బీఆర్ఎస్ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్యులైన సంజయ్, మెతుకు ఆనంద్, రాజయ్య ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీంతో హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అరెస్ట్ చేశారు. 

ALSO READ | జూబ్లీహిల్స్లోని నందగిరిలో కమర్షియల్ దందా !

దీంతో అక్కడ రాజయ్య అనుచరులు ఆందోళనకు దిగారు.. పోలీసులకు సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్పత్రి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, హైదరాబాద్ పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ను లోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.