సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే..

సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే..

యూపీఎస్సీ-2024 సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ ఇవాళ (ఏప్రిల్ 22, మంగళవారం) విడుదల చేసింది. ఉత్తరాఖండ్ లోని వారణాసికి చెందిన శక్తి దూబే మొదటి ర్యాంకు సాధించారు. హర్యానాకు చెందిన హర్షితా గోయల్ కు రెండో ర్యాంకు వచ్చింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. 

సివిల్స్ లో మెరిసిన తెలుగు విద్యార్థుల్లో సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. బన్నా వెంకటేశ్ కు 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ 68, ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణే ష్ రెడ్డి 119, చల్లా పవన్ కల్యాణ్ 146, ఎన్. శ్రీకాంత్ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ ర్యాంకులతో సత్తాచాటారు. సివిల్స్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను 15 రోజుల్లోగా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది. 

 కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర పోస్టుల భర్తీకి గత ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ హించారు. అందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ లో సత్తాచా టిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు చేశారు. ఇవాళ తుది ఫలితాలను ప్రకటించారు. మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది, ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు.