తీర్థయాత్రలకు వెళ్లి వచ్చే లోపు ఇళ్లు గుల్ల

తీర్థయాత్రలకు వెళ్లి వచ్చే లోపు ఇళ్లు గుల్ల

తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి వచ్చేలోగా దొంగలు ఇంటికి కన్నం వేసిన ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. అంజనాద్రి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న దాసరి మహిపాల్ రెడ్డి ఇంట్లో మొన్న రాత్రి దొంగలు చొరబడి నాలుగు తులాల బంగారంతో పాటు ఆరువేల రూపాయల నగదును అపహరించారు. రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి తీర్థయాత్రకు వెళ్లి నిన్న రాత్రి ఇంటికి చేరుకున్న మహిపాల్ కుటుంబ సభ్యులు ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువా పగలగొట్టి అందులో నగదు నగలను దుండగులు అపహరించారు. ఇద్దరు వ్యక్తులు గోడ దూకుతున్న దృశ్యాలు సిసి కెమెరాలలో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జవహర్ నగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.