హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: షాప్ షటర్ తెరిచి రూ.30.80 లక్షలు ఎత్తుకెళ్లిన ముగ్గురు సభ్యుల ముఠాను మహాంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ సర్ధార్ సింగ్ తన ఆఫీస్లో సోమవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మురళీధర్ మనోహర్ శర్మ, యూపీకి చెందిన చంద్రభాన్ పాటిల్, ఉదయ్ సింగ్ ఆరేండ్ల కింద సిటీకి వచ్చారు.
వీరు గతంలో సికింద్రాబాద్ ఏరియాలో టెక్స్టైల్బిజినెస్ చేశారు. లాక్డౌన్సమయంలో నష్టపోయి దివాళా తీశారు. ఆ తర్వాత చోరీలకు ప్లాన్వేశారు. అందులో భాగంగానే జనవరి 31న అర్ధరాత్రి ఓల్డ్ బోయిగూడలోని దీపక్ ఇంజినీరింగ్ షాప్ షెటర్ ఓపెన్ చేసి, లాకర్ లోని రూ.30.80 లక్షలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై మహాంకాళి పోలీసులు నాలుగు టీమ్స్ గా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా సికింద్రాబాద్సితార లాడ్జిలో నిందితులను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రూ.28.62 లక్షల నగదు రికవరీ చేశారు. చోరి జరిగిన మూడు రోజుల్లోనే ముఠాను పట్టుకున్న మహాంకాళి సీఐ పరశురామ్, డిటెక్టివ్ సీఐ ప్రసాద్, ఎస్ఐలు గంగాధర్, శ్రీవర్దన్తో పాటు మహాంకాళి, మార్కెట్, రాంగోపాల్పేట సిబ్బందిని ఏసీపీ అభినందించారు.