యాదాద్రి జిల్లాలో గుడి హుండీలు పగలగొట్టి చోరీ

యాదాద్రి జిల్లాలో గుడి హుండీలు పగలగొట్టి చోరీ

యాదాద్రి, వెలుగు : గుడిలోని హుండీలను పగులకొట్టి చోరీకి పాల్పడిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. భువనగిరి రూరల్​ పోలీసుల వివరాల ప్రకారం.. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ పూజారి పవన్​ కుమార్ శర్మ పూజలు నిర్వహించిన అనంతరం బుధవారం సాయంత్రం గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో దుండగులు టెంపుల్​పశ్చిమ ద్వారం తాళాలు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. 

హుండీని పగులకొట్టి అందులో నెలరోజులుగా భక్తులు వేసిన కానుకలను దొంగిలించారు. అనుబంధ హనుమాన్ టెంపుల్​లోని హుండీతోపాటు స్టోర్​రూంలోని చిన్న హుండీలను పగలకొట్టి నగదు ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం అటెండర్ బత్తిని వెంకటేశం గుడికి వచ్చి చూడగా.. 

తాళాలు, హుండీలు పగులకొట్టి ఉన్న విషయాన్ని గమనించి పూజారి పవన్​కుమార్​శర్మకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. గుడికి వచ్చిన పూజారి వెంటనే గ్రామ పెద్దలకు దొంగతనం జరిగిన విషయాన్ని వివరించాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.