
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రెండో సారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జీలను నియమించే పనిలో పడ్డారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జీలను ప్రకటిస్తూ రెండు జాబితాలను విడుదల చేశారు. తాజాగా మూడో జాబితా గురువారం (జనవరి 11) విడుదల చేశారు. ఈ జాబితాలో మొత్తం 21 స్థానాల్లో కొత్త ఇంఛార్జీలను నియమించారు సీఎం జగన్.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘంగా చర్చించి మూడో జాబితాను ఫైనల్ చేశారు. ఈ జాబితాలో పార్లమెంట్ పరిధిలోని పలువురికి ఇంఛార్జీలుగా అవకాశం కల్పించారు.
లోక్ సభ స్థానాలకు ఇంఛార్జీలు వీరే
- శ్రీకాకుళం - పెరాడ తిలక్
- విశాఖపట్నం -బోత్స ఝాన్సీ లక్ష్మీ
- ఏలూరు- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
- విజయవాడ - కేశినేని నాని
- కర్నూలు - గుమ్మనూరి జయరాం
- తిరుపతి - కోనేటి ఆదిమూలం
అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జీలు వీరే
- ఇచ్చాపురం - పిరియ విజయ
- టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్
- చింతలపూడి -కంభం విజయ రాజు
- రాయదుర్గం - మెట్టు గోవింద రెడ్డి
- దర్శి - బూచేపల్లి శివప్రసాదరెడ్డి
- పూతల పట్టు (ఎస్సీ) - మూతిరేవుల సునీల్ కుమార్
- చిత్తూరు - విజయానందరెడ్డి
- మదనపల్లె - నిస్సార్ అహ్మద్
- రాజంపేట -ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి
- ఆలూరు - బూసినే విరూపాక్షి
- కోడుమూరు (ఎస్సీ) - డాక్టర్ సతీష్
- గూడూరు (ఎస్సీ ) -మేరిగ మురళి
- సత్యవేడు (ఎస్సీ) - మద్దిల గురుమూర్తి
- పెనమలూరు - జోగి రమేష్
- పెడన - ఉప్పాల రాము
శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.