
శ్రీవారి భక్తులకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం)తీపి కబురు అందించింది. శుక్రవారం నుంచి భక్తులకు శ్రీవారి మహా ప్రసాదం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలనా భవనం వద్ద శ్రీవారి కళ్యాణోత్సవ లడ్డూలను విక్రయానికి ఉంచారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టిన పెద్ద లడ్డూలతో పాటు శ్రీవారి వడ ప్రసాదాన్ని సైతం విక్రయించనున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కోరినన్ని లడ్డూ, వడలు ఇస్తున్నారు. 50 రోజుల తర్వాత లడ్డూ ప్రసాదం అందుబాటులోకి రావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.