యూట్యూబర్ ఫ్యామిలీ సూసైడ్.. యాక్టివ్‌గా ఉండే వాళ్లు.. ఎందుకిలా..?

యూట్యూబర్ ఫ్యామిలీ సూసైడ్.. యాక్టివ్‌గా ఉండే వాళ్లు.. ఎందుకిలా..?

నవ్వుతూ ఉండే ఫేసులతో.. గలగల మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూజర్లను గంటల తరబడి తమ తిప్పుకునే ఓ జంట అకస్మాత్తుగా రూమ్ లో డెడ్ బాడీలుగా కనిపించారు. ఇప్పటివరకు వారు చేసిన వీడియోస్ 34 వేల మంది చూశారు. భార్య భర్తలు కలిసి చేసిన లాస్ట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. ఫాలోవర్స్ కన్నీటి పర్యాంతం అవుతున్నారు. సెల్వరాజ్ కుటుంబం దు:ఖ సంద్రంలో మునిగిపోయారు. అసలు ఏం జరిగిందంటే..

కేరళ తిరువనంతపురానికి చెందిన సెల్వరాజ్, ప్రియ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. వారి యూట్యూబ్ ఛానల్‪లో 17 వేల సబ్‌స్ర్కైబర్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 16వందల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పొద్దున్న లేచిన కానుంచి.. సాయంత్రం వరకు వారి యాక్టివిటీస్ అన్ని సోషల్ మీడియాతో పంచుకుంటూ.. ఫాలోవర్స్ ను మెప్పిస్తారు. ఆ జంట ఇప్పటివరకు 400 వీడియోస్ క్రియేట్ చేశారు. భార్యాభర్తలు ఇద్దరూ గంటల తరబడి పెంపుడు కుక్కలు, డైలీ యాక్టివిటీస్, వివిధ రకాల వంటకాలు వండటం వంటి కంటెంట్ మీద వీడియోస్ చేస్తుంటారు. 

ALSO READ | హైదరాబాద్ వీకెండ్ సంతలో.. మోమోస్ తిని మహిళ మృతి

సడెన్ గా అక్టోబర్ 27న గదిలో విగత జీవులుగా పడి ఉన్నారు. సెల్వరాజ్ ఫ్యాన్ కు ఉరేసుకొని, ప్రియ కిందపడిపోయిన మృతదేహాలను పక్కింటి వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చనిపోయి అప్పటికే రెండు రోజులు అయి ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. శుక్రవారం సోషల్ మీడియాలో వాళ్ల చివరి పోస్ట్ నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది. సెల్వరాజ్, ప్రియ లు ఆత్మహత్య చేసుకున్నట్లు పరసాల పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్థారించారు.