
పహల్గాం దాడికి తామే పాల్పడ్డట్టు పాకిస్తాన్కు చెందిన టెర్రర్గ్రూపు లష్కరే -తోయిబా స్థానిక శాఖ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. 2017 తర్వాత టూరిస్టులపై జమ్మూకాశ్మీర్లో దాడి జరిగడం ఇదే మొదటిసారి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి కూడా ఇదే. ఉగ్రవాదులు అచ్చం 26/11 ముంబై దాడుల తరహాలో పహల్గాం అటాక్కు తెగబడ్డారు.
నలుగురైదుగురు టెర్రరిస్టులు ఆర్మీ, పోలీస్ యూనిఫామ్ ధరించి.. ముఖాలకు మాస్కులు పెట్టుకొని, తుపాకులతో టూరిస్టులున్న ఏరియాకు వచ్చారు. ‘మీది ఏ మతం’ అంటూ అడిగిన ప్రాణాలు తీశారు. కొందరు టూరిస్టులతో ప్రార్థనలు చేయించి.. కాల్చి చంపారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒకవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనలో ఉండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేసీ వాన్స్ ఇండియాలో పర్యటిస్తుండగా.. పాకిస్తాన్ టెర్రర్ సంస్థ జమ్మూకాశ్మీర్లో టూరిస్టులే లక్ష్యంగా కాల్పులు జరపడం కలకలం రేపింది.
ALSO READ : పెళ్లై ఏడు రోజులే..భార్యతో హానీమూన్ కు వచ్చి ..ఉగ్రదాడిలో బలైన నేవీ అధికారి విషాదగాధ
ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి జమ్మూకాశ్మీర్లో టూరిస్టులు తాకిడి పెరిగింది. త్వరలోనే అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుండటంతో ఉగ్రదాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం మార్గంలో 48 కి.మీ, గండేర్బల్ జిల్లాలో 14 కి.మీ.లు సాగుతుంది. పహల్గాం మార్గంలోని బైసరన్లోనే ప్రస్తుతం ఉగ్రదాడి జరిగింది. భద్రతా బలగాలు గాలింపును ముమ్మరం చేశాయి. టూరిస్టులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసింది.