24క్యారెట్ల గోల్డ్ స్వీట్స్ ఎప్పుడైనా చూశారా.. కేజీ రూ. 50వేలు

24క్యారెట్ల గోల్డ్ స్వీట్స్ ఎప్పుడైనా చూశారా.. కేజీ రూ. 50వేలు
  • హోలీ సందర్భంగా యూపీలో తయారీ

లక్నో: దేశమంతా రంగులతో హోలీ జరుపుకుంటున్న వేళ ఉత్తరప్రదేశ్​ లోని ఓ స్వీట్​ షాపు నిర్వాహకుడు బంగారం పూతతో తయారు చేసిన స్వీట్లు అమ్మకానికి పెట్టారు. 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఆ స్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటి ధర కిలోకు రూ.50వేలుగా బోర్డు పెట్టారు. కేజీ కొనలేం. 

 

ఒక్క స్వీటు చాలనుకుంటే మాత్రం రూ.1,300లు చెల్లించాలి. స్వీటుపై బంగారు పూత పూయడంతో పాటు అందులో ప్రత్యేకమైన డ్రైఫ్రూట్స్ నింపినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్వీట్ ఫొటోలు నెట్టింట వైరల్​ గా మారాయి.

Also Read:-హోలీ రోజు భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్లో 90 వేలకు దగ్గర్లో తులం రేటు