
జియో తీసుకొచ్చిన జియోటెలీ ఓఎస్తో 43 ఇంచుల టీవీని మార్కెట్లో లాంచ్ చేశామని థామ్సన్ ప్రకటించింది. రూ.19 వేల ధర ఉండే ఈ టీవీ అమ్మకాలు ఫ్లిప్కార్ట్లో శుక్రవారం నుంచి మొదలవుతాయి. ఇందులో క్యూఎల్ఈడీ డిస్ప్లే, హెచ్డీఆర్, డాల్బీ డిజిటల్ ప్లస్, 40 వాట్స్ సౌండ్, వాయిస్ అసిస్టెంట్, 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ ఉంటాయి. ఈ టీవీ కొంటే 3 నెలల జియో హాట్స్టార్, 3 నెలల జియోసావన్, నెలపాటు జియో గేమ్స్ సబ్స్క్రిప్షన్ ఉచితం.