
తొర్రూరు, వెలుగు : ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తొర్రూరు పోలీసులు పట్టుకున్నారు. దుబ్బతండ వద్ద పోలీసులు వాహనాలు తనీఖీ చేస్తుండగా అటుగా వచ్చిన లారీని చెక్ చేశారు. దాంట్లో 24.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. మహబూబాబాద్ నుంచి మరిపెడ హైవే రోడ్డులో మహారాష్ట్ర కు తరలిస్తున్నారని డ్రైవర్ మనోజ్ ధర్మదాస్ గులాడే చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.