
న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మను చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ జైలు నుంచి ఓ ఖైదీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పోక్సో కేసులో అరెస్టయిన రింకు అనే వ్యక్తి డౌసా జైలులో ఉన్నాడు. శనివారం అతను ఓ ఫోన్నుంచి సెక్యూరిటీ వింగ్కు ఫోన్ చేసి సీఎంను చంపేస్తానంటూ బెదిరించాడు. దీనిపై అలర్ట్ అయిన సిబ్బంది దర్యాప్తు చేపట్టారు.
ఆ ఫోన్ కాల్ డౌసా జైలు నుంచి రింకు అనే వ్యక్తి చేసినట్టు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై వివరాలు రాబడుతున్నారు. అయితే, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి జైలు సిబ్బంది సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.