మిమ్మల్ని చంపేస్తా.. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు

మిమ్మల్ని చంపేస్తా.. ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు

జూబ్లీహిల్స్, వెలుగు: సోషల్​మీడియాలో తమకు పబ్లిసిటీ కల్పిస్తానంటూ వచ్చిన వ్యక్తి తమను చంపుతానంటూ బెదిరిస్తున్నాడని ఎమ్మెల్సీ విజయశాంతి భర్త ఎంవీ శ్రీనివాస ప్రసాద్​ బంజారాహిల్స్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేండ్ల కింద ఎం.చంద్రశేఖర్​రెడ్డి అనే వ్యక్తి కంటెంట్ ​క్రియేటర్​ పేరుతో తమని సంప్రదించాడని, రాజకీయ, వ్యాపార రంగాల్లో పబ్లిసిటీ కల్పిస్తాననడంతో అంగీకరించామన్నారు. 

అయితే ఆయనతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదన్నారు. తాము బీజేపీలో ఉన్నప్పుడు పరిచయమయ్యాడని, కంటెంట్​నచ్చకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆయన సేవలను వినియోగించుకోవడం ఆపేశామన్నారు. కాగా, తాజాగా పెండింగ్​బిల్లులు క్లియర్​చేయకపోతే చంపేస్తానంటూ మెసేజ్​పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి ఎమ్మెల్సీ అయ్యాక బెదిరింపులు రావడంపై అనుమానం వ్యక్తం చేశారు.