రాయికల్‌‌లో భీమేశ్వరస్వామి రథోత్సవం

రాయికల్‌‌లో భీమేశ్వరస్వామి రథోత్సవం

రాయికల్, వెలుగు: రాయికల్​పట్టణంలోని పురాతన భీమేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఆలయానికి ఉదయం నుండే భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాయికల్​, మేడిపెల్లి, సారంగాపూర్, మల్లాపూర్​, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తుల సమక్షంలో రథోత్సవం వైభవంగా సాగింది. 

భక్తులు పోటీపడుతూ స్వామివారిని ఆలయం చుట్టూ తిప్పారు. రథం ముందు పూజరుల విన్యాసాలు అలరించాయి. అంతకుముందు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశీయులు దేవుని చిన్నరాజం, భీమన్న యూత్​సభ్యులు, మున్నూరుకాపు యూత్​ సభ్యులు జాతరలో ఏర్పాట్లు చేశారు.