
- ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంజూరు
- సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఈ నెల 26, 27, మార్చి 3న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 జిల్లాల్లో ఈ సెలవులు వర్తించనున్నట్టు పేర్కొన్నారు. 27న పోలింగ్ ఉండడంతో ఆ రోజు, అంతకంటే ముందు రోజు, వచ్చే నెల 3న కౌంటింగ్ ఉన్నందున సెలవులు మంజూరు చేశారు.
రాష్ట్రంలో మెదక్–-కరీంనగర్–-ఆదిలాబాద్–-నిజామాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీతో పాటు నల్గొండ–-వరంగల్–-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ
ఎన్నికలకు పోలింగ్ ఉన్నందున సెలవు ప్రకటించినట్టు పేర్కొన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులందరికీ అవకాశం కల్పిస్తూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అందుకు తగ్గట్టుగా జీవో ఇచ్చారు.