
హనుమకొండ సిటీ, వెలుగు : గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ దేవేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఏసీపీవివరాలు వెల్లడించారు. హనుమకొండ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన జన్ను మనోహర్, సిటీకి చెందిన మరో ఇద్దరు చిన్నాల సాయి కిరణ్, కత్తుల శివశంకర్ గంజాయికి అలవాటు పడ్డారు. ఈక్రమంలో ఇతర ప్రాంతాలనుంచి గంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ఈనెల 11న ఎస్ఐ సతీశ్ నిఘా వేసి పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు.