యూట్యూబ్ ఛానెల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

యూట్యూబ్ ఛానెల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని ప్రముఖ హాస్పిటల్ మేనేజ్​మెంట్​ను బెదిరిస్తున్న యూట్యూబ్​ఛానెల్​కు చెందిన ముగ్గురిని వన్​టౌన్​ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఓ హాస్పిటల్​ ప్రతి సంవత్సరం 5 లక్షలు తమ యూట్యూబ్​ఛానెల్​కు యాడ్ ఇవ్వాలని, లేకపోతే హాస్పిటల్​కు వ్యతిరేకంగా కల్పిత వార్తలను అప్​లోడ్ చేస్తామని

ఓ యూట్యూబ్ ఛానల్ కు చెందిన పుచ్చకాయల ప్రకాశ్, అత్తులూరి రామకృష్ణ అలియాస్ రాంకీ, అసిస్టెంట్ కెమెరామెన్ షేక్ బాబా బెదిరిస్తున్నారు. ఈ విషయమై హాస్పిటల్ మేనేజ్​మెంట్ బుధవారం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో వారి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.