
- హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు
నిజామాబాద్, వెలుగు: కస్టం మిల్లింగ్కోసం గవర్నమెంట్ఇచ్చిన వడ్లు గయబ్అయ్యేలా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు సహకరించిన ముగ్గురు ఆఫీసర్లు బుక్ అయ్యారు. వారిలో గతంలో జిల్లాకు అదనపు కలెక్టర్గా పనిచేసిన బడుగు చంద్రశేఖర్ (ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) ఉన్నారు. అలాగే, డీఎస్వోగా విధులు నిర్వహించిన చంద్రప్రకాశ్ (సస్పెండెడ్), డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్ఉన్నారు. మార్చి25న ఈ ముగ్గురుపై వర్ని పోలీసులు కేసు పెట్టారు. వర్ని మండలానికి చెందిన రైస్ మిల్లర్ బోయపాటి కిషోర్ హైకోర్టులో చేసిన పోరాట ఫలితంగా ఆర్డర్స్ వెలువడ్డాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఆఫీసర్లను తన గుప్పిట్లో పెట్టుకొని షకీల్తన నిర్వహణలోని 5 రైస్ మిల్స్కు భారీగా కస్టం మిల్లింగ్వడ్లను తరలించుకున్నారు.
2021 ఖరీఫ్, యాసంగి సీజన్లతో పాటు 2022–23 ఖరీఫ్కు చెందిన రూ.80 కోట్ల విలువైన 37 వేల టన్నుల వడ్లు మాయమైనట్లు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు తేల్చింది. తాను సేకరించిన వడ్లు టెక్నికల్ కారణాలతో మిల్లింగ్ చేసే వీలు లేనందున ఇతర మిల్లులకు పంపినట్లు అంతకుముందు షకీల్ ఆఫీసర్లకు తెలుపగా, ఆ వడ్లు రైస్ మిల్స్కు చేరలేదు. షకీల్కు సహకరించే ఆలోచనతో అతను ప్రభుత్వానికి వడ్ల బాకీ లేడని అప్పుడు ఆ ముగ్గురు అధికారులు బోగస్ రిపోర్టులు రెడీ చేశారని మిల్లర్ బోయపాటి కిషోర్ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ముగ్గురు ఆఫీసర్లపై కేసు నమోదైంది.