చేపలు పట్టేందుకు లీజు పొడిగించాలని నిరసన

చేపలు పట్టేందుకు లీజు పొడిగించాలని నిరసన

జైపూర్(భీమారం), వెలుగు: భీమారం మండల కేంద్రంలోని గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు లీజును పొడగించాలని ముగ్గురు వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సంఘం  నుంచి మూడేండ్లుగా గొల్ల వాగు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు లీజుకు తీసుకున్న నర్సయ్య, మధుకర్, దుర్గయ్య గురువారం మండల కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి లీజును పొడగించాలని డిమాండ్​చేశారు.

తాము మూడేండ్ల కాలంగా నష్టపోయామని, కనీసం మారో ఆరు నెలలు లీజు పొడిగించాలని కోరారు. న్యాయం చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో కిందకు దిగారు.

ALSO Read : హత్రాస్ బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ