హైదరాబాద్ లో..తొలి మహిళా ఈవీ చార్జింగ్ స్టేషన్​ ప్రారంభం

హైదరాబాద్ లో..తొలి మహిళా ఈవీ చార్జింగ్  స్టేషన్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ఈవీ చార్జింగ్​ ప్రొవైడర్​ థండర్​ప్లస్​ హైదరాబాద్‌‌లో భారతదేశపు తొలి మహిళా ఈవీ ఫాస్ట్ చార్జర్ ఫ్రాంచైజీని ప్రారంభించింది. ఈ  కార్యక్రమం  వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ ఛార్జింగ్ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తోందని పేర్కొంది.  

ఒక ప్యాకేజీగా దీనిని అందిస్తున్నామని తెలిపింది. ఇందులోనే 30 కిలోవాట్ల డీసీ 4-వీలర్ చార్జర్,  టెక్నాలజీ సౌకర్యం, ఇన్​స్టలేషన్​, బ్రాండింగ్, షెడ్డు, వ్యాపారాభివృద్ధికి మద్దతు వంటి సదుపాయాలు ఉంటాయి. రూ. ఆరు లక్షల పెట్టుబడితో మూడు సంవత్సరాల్లో రూ. 12 లక్షల ఆదాయం పొందవచ్చని థండర్​ప్లస్​  ప్రకటించింది.