మంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక

మంచిర్యాల జిల్లా ఆవుడంలో పులి సంచారం.. గ్రామాల ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరిక

బెల్లంపల్లి రూరల్, వెలుగు:  మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల అడవుల్లో పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పది రోజులుగా బెల్లంపల్లి డివిజన్​లోని అడవుల్లో సంచరించిన పులి  పొట్యాల అడవుల్లోకి వచ్చినట్టు  ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

 మంగళవారం చెన్నూర్​ఎఫ్​డీఓ సర్వేశ్వర్​రావు, మంచిర్యాల రేంజ్​ఆఫీసర్ రత్నాకర్​ సిబ్బందితో వెళ్లి చిత్తాపూర్​ కలి చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు నీల్వాయి రేంజ్​అధికారి అప్పలకొండ తెలిపారు. పులి జాడ ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెప్పారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.