
వేములవాడరూరల్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. రెండు రోజుల కింద గేదెపై పులి దాడి చేయగా, ఫారెస్ట్ అధికారులు పాదముద్రలు, ఆనవాళ్లు సేకరించారు. పులి సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఫాజుల్నగర్ గ్రామం నుంచి కొండాపూర్ అటవీ ప్రాంతం వరకు ఉన్న గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఆర్వో ఖలీలోద్దీన్ సూచించారు. పొలాల వద్దకు రైతులు గుంపుగా వెళ్లాలన్నారు. పులికి సంబంధించిన సమాచారం తమకు అందించాలని సూచించారు.