
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలలోఅనధికారికంగా నివాసం ఉంటున్న 22 మందిని వాహనంలో తరలిస్తున్నారు. వాహనపం మొదటి మలుపు దగ్గరకు రాగానే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.