
తిరుమల ఘాట్ రోడ్లపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం చోటు చేసుకుంది. వరుస ప్రమాదాలు జరగడంతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ( ఏప్రిల్) 19 రాత్రి మొదటి ఘాట్ రోడ్డులో బ్రేక్ ఫెయిల్ అదుపు తప్పిన టెంపో ట్రావెలర్.. చెట్టును ఢీకొనడంతో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన నుంచి తేరుకోకముందే .. ఆదివారం ( ఏప్రిల్ 20) ఉదయం రెండవ ఘాట్ రోడ్డులో కారు దగ్ధమైంది. మరో ప్రమాదంలో ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు రక్షణ గోడను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.