తిరుమల కొండపై నాగుపాము హల్ చల్​.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమల కొండపై నాగుపాము హల్ చల్​.. భయంతో పరుగులు తీసిన భక్తులు

తిరుమలలో ఐదు అడుగుల  నాగుపాము హల్​ చల్​ చేసింది. తిరుమల కొండపై వీఐపీ ప్రాంతం  పద్మావతి ఏరియాలో నాగుపాము బుసలు కొడుతూ  కలకలం రేపింది. స్పెషల్​ టైప్​ గెస్ట్​ హౌస్​ రూమ్​ 12 దగ్గర నాగు పాము భక్తులకు కనిపించింది.దీంతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే టీటీడీ సిబ్బందికి నాగుపాము గురించి సమాచారం అందించారు. టీటీడీ సిబ్బంది సమాచారంతో స్నేక్ క్యాచర్  భాస్కర్ నాయుడు  అక్కడకు చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా నాగుపామును బంధించారు.అనంతరం ఈ భారీ నాగుపామును పాపనాశనం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.  నాగుపామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.