యూకే కరెన్సీ ఇస్తానని మోసం.. రెండేండ్ల తరువాత శంషాబాద్​ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ నిందితుడు

యూకే కరెన్సీ ఇస్తానని మోసం.. రెండేండ్ల తరువాత శంషాబాద్​ ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ నిందితుడు

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు: చదువు కోసం లండన్‌‌‌‌‌‌‌‌  వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఓ స్డూడెంట్‌‌‌‌‌‌‌‌ను మోసం చేసి రూ. 6 లక్షలు కాజేసిన వ్యక్తి రెండేండ్ల తరువాత పోలీసులకు పట్టుబట్టాడు. శుక్రవారం మెట్​పల్లి సీఐ నిరంజన్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్  మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన మామిడాల నితీశ్​కుమార్ ఉన్నత చదువుల కోసం 2023లో లండన్ లో ఓ యూనివర్శిటీలో అడ్మిషన్ కోసం ప్రయత్నాలు చేశాడు.

ఆ సమయంలో టెలిగ్రాం యాప్ లో పరిచయమైన తిరుపతికి చెందిన షణ్ముఖ కృష్ణ యాదవ్  ఇండియా కరెన్సీతో ఫీజులు కడితే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయని, తన అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్​ఫర్  చేయాలని, లండన్  కరెన్సీ ద్వారా ఫీజు కడితే తక్కువ డబ్బులు ఖర్చవుతాయని  నమ్మించాడు. బ్యాంక్​ ఖాతా వివరాలు, పాస్​పోర్ట్​ వివరాలు పంపించడంతో నమ్మి రూ.6 లక్షలు కృష్ణయాదవ్​ ఖాతాలోకి ట్రాన్స్​ఫర్​ చేశారు.

ఆ తరువాత కృష్ణయాదవ్  ఫోన్  స్విచ్ ఆఫ్  చేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం శంషాబాద్​ ఎయిర్ పోర్టులో దిగిన కృష్ణ యాదవ్ ను గుర్తించిన  ఇమ్మిగ్రేషన్  అధికారులు మెట్ పల్లి సీఐకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.