రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే.. రాళ్లతో దాడి

రెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే.. రాళ్లతో దాడి

ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను టీఎన్జీవోస్ కాలనీ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని  సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వం స్థలం ఆక్రమించి ఇతరులకు విక్రయించారు. స్థలం కొన్నవారు కాంపౌండ్ వాల్ నిర్మించగా.. ఆ నిర్మాణాలను టీఎన్జీవోస్ కాలనీలో రెవెన్యూ అధికారుల బుధవారం కూల్చివేశారు. 

ALSO READ | ఐదు అంతస్థుల బిల్డింగ్ కూల్చకుండా సీజ్ చేశారు.. ఎందుకంటే?

బాధితులు జేసీబీని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రెవెన్యూ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఓ వ్యక్తి జేసీబీ అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు కలుగజేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకి న్యాయం చేయాలని బాధిత కుటుంబం అధికారుల కాళ్లావేళ్లా పడింది.