టీఎన్జీవోస్​ ట్రెజరర్ రామినేని శ్రీనివాసరావు మృతి

 టీఎన్జీవోస్​ ట్రెజరర్ రామినేని శ్రీనివాసరావు మృతి

హైదరాబాద్, వెలుగు: అనారోగ్యంతో టీఎన్జీవోస్​ కేంద్ర సంఘం ట్రెజరర్, తెలంగాణ ఉద్యమ కారుడు రామినేని శ్రీనివాస్ రావు (60 )  కన్నుమూశారు. ఆయన ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్‎గా పనిచేస్తున్నారు. గత నెల 14న బ్రెయిన్ స్ట్రోక్ రాగా..  హైదరాబాద్​మలక్ పేటలోని ఓ హాస్పిటల్‏లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.  

శ్రీనివాసరావు గత 6 ఏండ్ల నుంచి కేంద్ర  సంఘం ట్రెజరర్ గా పనిచేస్తున్నారు. సోమవారం నాదర్ గుల్‎లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.  కాగా, శ్రీనివాస్ రావు మృతికి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ సీఎం  కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు,  టీఎన్జీవోస్​ కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, టీజీవో అధ్యక్ష, ప్రధాన  కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ సంతాపం తెలిపారు.